టి. సుండుపల్లిలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

      రాజంపేట ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీల కార్యక్రమం ఘనంగా నిర్వహించిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ.  టి సుండుపల్లి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో భారీ స్థాయిలో టి సుండుపల్లి మరియు వీరబల్లి గ్రామాల మహిళలతో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 150 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు, రెండవ బహుమతి 20వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు న్యాయ నిర్ణీతలు ఎంపిక చేశారు. విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్, అతిగారి కృష్ణ గార్ల చేతులమీదుగా అందజేశారు.  పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుండుపల్లి వీరబల్లి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way