రవాణా రంగాన్ని ఆదుకోండి : జనసేన నాయకులు రాష్ట్ర కార్యదర్శి శివదత్

జనసేన

        విజయవాడ ( జనస్వరం ) : రవాణా రంగం కుదేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన టాక్స్ వెంటనే తగ్గించాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్ అధ్వర్యంలో జరిగిన మీడియా సమవేశానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప్రభుత్వం టాక్స్ రూపంలో అత్యధికంగా భారం మోపి లారీ ఓనర్స్ ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆవేదన వ్యక్త పరిచారు. వెంటనే టాక్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని, ఆంధ్ర తెలంగాణా సింగిల్ పర్మిట్ జిఓ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మద్దిపాడు ఏ. వినాయక రాజు, టంగుటూరు ఏవి నరసరాజు, ఏలూరు వెంకట కృష్ణా రావు, యూనియన్ మెంబర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way