గోపి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి : యుగంధర్ పొన్న

యుగంధర్ పొన్న

        చిత్తూరు ( జనస్వరం ) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం కండ్రిగ గ్రామం కె. గోపి పురిల్లు దగ్ధం అయింది. షాట్ సర్కూట్ వల్ల పూర్తిగా పూరిళ్లు కాలియిన బాధిత కుటుంబాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరామర్శించారు. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులైన ఈ కుటుంబానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జనసేన పార్టీ తరఫున కూడా ఈ కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మండల అధికారుల స్పందనకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి కుటుంబాలకు ఆదరణగా నిలవాలని, అన్ని విధాల ఆదుకోవాలని, తమ వంతు సహాయం వారికి అందించాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. కట్టుబట్టలతో మిగిలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. మానవ సేవే మాధవ సేవని, ఇబ్బందుల్లో ఉన్న వారిపట్ల ఆపన్న హస్తం అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రండి ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుందాం అని పిలుపునిచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వంట సామాగ్రి, బట్టలు, గ్యాస్ స్టవ్వు, సిలిండర్, ఇత్యాది వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు, స్థానికులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way