సప్లమెంటరీ ఫీజు రద్దు చేయాలి, ఆ భారం ప్రభుత్వమే మోయాలి : డా. యుగంధర్ పొన్న

ఫీజు

        చిత్తూరు ( జనస్వరం ) : పదవ తరగతి లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఆ భారం కూడా ప్రభుత్వమే మోయాలని ఈ సందర్బంగా తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 32% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అన్నారు. టీచర్లను బోధనేతర పనులకు ఉపయోగించడం, పేపర్ లో లీక్ కావడం విద్యార్థులపై ప్రభావం చూపాయి అన్నారు. 71 స్కూల్ లలో ఒక్కరు కూడా పాస్ కాలేదని, అందులో 22 ప్రభుత్వ స్కూల్స్ ఉండటం సిగ్గుచేటని అన్నారు. భవిష్యత్ మార్గదర్శకులైన ఉపాధ్యాయులకు సరియైన గౌరవం, సరియైన ప్రోత్సాహం అందించాలని, వారిని వైన్ షాప్ ల వద్ద కాపలాదారులుగా పెడితే రిసల్ట్ ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉపాధ్యాయులు కి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ప్రాధాన్యత పనులు వారికిచ్చి సముచిత స్థానం కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు లోకేష్, శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శులు గణేష్, నరసింహ, సోము కార్యదర్శి గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రకాష్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way