సుంకే శ్రీనివాసరావు మరణం జనసేన పార్టీకి తీరని లోటు : గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

     గుంటూరు, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పార్టీ బలోపేతానికి అన్ని రకాలుగా కృషి చేసిన పార్టీ క్రియాశీలక జన సైనికుడు సుంకే శ్రీనివాసరావు మరణించడం పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుజ్జనగుండ్లలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ రోజు తెల్లవారుజామున మరణించిన సుంకే శ్రీనివాసరావు మృతదేహానికి ఆయన పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. 39 వ డివిజన్ లో పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సుంకే శ్రీనివాసరావు ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. శ్రద్దాంజలి ఘటించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కమాల్, చేజర్ల శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, కార్యదర్శి నక్కల వంశీ, జనసైనికులు శిఖా బాలు, కొండూరు కిషోర్, ఆళ్ళ హరి తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way