సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె – అండగా జనసేన : డా.పసుపులేటి హరి ప్రసాద్

జనసేన

      తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి, టీటీడీ సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెలో ఉండటంతో సాయంత్రం వీరికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు ఆకలితో ఉన్న కార్మికులకు సాయంత్రం తినడానికి కిచిడి ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం రోజున టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జిల్లా తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా ఎస్పి సమ్మెలు జరుపకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. జనసేన అండగా ఉంటే వారు దానిని ఏదో శక్తుల కుట్ర ఉందని దుష్ప్రచారం చేయటం హేయమైన చర్యని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ వీరు అన్న మాటలను ఖండిస్తుందని, జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలవైపు ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, నగర కార్యదర్శి కిరణ్ కుమార్, జనసేన సీనియర్ నాయకులు పోర్లుదండాలు ఈశ్వర్ రాయల్, జిల్లా కార్యదర్శులు పి. ఆనంద్, బాటసారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way