
అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో SSBN ఎయిడెడ్ కాలేజీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన నేపథ్యంలో పోలీసువారు మరియు యజమాన్యం కలిసి విద్యార్థులపై జరిపిన దాడి విషయం తెలిసిన తక్షణమే స్పందించి, SSBN కాలేజీ విద్యార్థులందరికీ అండగా నిలిచి రాజకీయాలకు అథితంగా సమస్య పరిష్కారమే ధ్యేయంగా, విద్యార్థుల ఉద్యమం పక్కదారి పట్టకుండా ప్రైవేటీకరణ నిలిపివేసి ఎయిడెడ్ కాలేజీని కొనసాగిస్తామని మేనేజ్మెంట్ తీర్మానం చేసేవరకూ తోడునీడగా ఉండి మా ఉద్యమాన్ని సరైన మార్గంలో నడిపించి మాకు మార్గానిర్దేశం చూపిన జనసేన నాయకులు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారు, చరణ్ గారు, M.V. శ్రీనివాస్ గారు, కె.విశ్వనాధ్ గారు, పవనిజం రాజు గారు, సంపత్ గారు, అశోక్ గారు మరియు జనసేన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇదే విధంగా మును ముందు మా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తోడుండాలని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారిని కలిసి ఘనంగా సత్కరించి, విద్యార్థులకు అండదండగా నిలిచినందుకు జనసేన పార్టీకి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.