Search
Close this search box.
Search
Close this search box.

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని వింతలు, విడ్డురాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

    చిత్తూరు, (జనస్వరం) : ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి రూ.800 కోట్లు మాయం అయిపోయాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అనేక వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని వర్గాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా జగన్ రెడ్డి మోసం చేశారు. వారంలో CPS రద్దు అని ఇప్పుడు అసాధ్యం అంటున్నారు. ఇప్పుడు ఏకంగా డీఏ ఏరియర్స్ సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లో పడినట్లే పడి మాయం అయిపోయాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో నుండి డబ్బు వెనక్కి తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు అర్దం. కానీ ఆర్ధిక మంత్రి మాత్రం ఏ ఇబ్బందులూ లేవని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలారా! జగన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల మాటున ఆర్ధిక క్రమశిక్షణను అస్సలు పాటించడం లేదు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ గమనించి రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని దారం అనిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way