Search
Close this search box.
Search
Close this search box.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల స్వాధీనాన్ని ఆపాలి : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి

ఎయిడెడ్‌

  అనంతపురం, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భావితరాలకు విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తోందని వెంటనే ఈ దుశ్చర్యను ఆపాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ఉన్న తమ మమకారాన్ని, గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. లక్షలాదిమంది ఆయా విద్యాసంస్థల్లో చదివారని, తమ పిల్లలు కూడా ఆయా విద్యాసంస్థల్లో చదవాలని కోరుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా భావి తరాలను నాశనం చేసే విధంగా పభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనానికి ముందుకెళితే జనసేన అధ్వర్యంలోఉద్యమిస్తామని జయరామిరెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way