Search
Close this search box.
Search
Close this search box.

తెలంగాణ రాష్ట్రములో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ .నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ

          హైదరాబాద్,  (జనస్వరం) :  హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన జనసేపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ.నేమూరి శంకర్ గౌడ్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ.అర్హం ఖాన్ గారు రాష్ట్ర నాయకులు శ్రీ.రామ్ తాళ్లూరి గారు. అనంతరం శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ.పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తారన్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కార్యకర్తల భద్రత కోసం ఇన్సూరెన్స్ కొరకు కోటి రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చిన గొప్ప ప్రజానాయకులు అని అన్నారు. అలాంటి నాయకుని అడుగుజాడల్లో మనం అందరం పార్టీని బలోపేతం చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం లో జిల్లాల వారీగా జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న అందరికి అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ చైర్మన్ మండపాక కావ్య, రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, వరంగల్ జిల్లా ఇంఛార్జ్ సుమన్, నల్గొండ అధ్యక్షులు నాగేశ్వర రావు గార్లు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way