Search
Close this search box.
Search
Close this search box.

రోళ్ళ మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఆత్మీయ

           అనంతపురం ( జనస్వరం ) : రోళ్ళ మండలం, రత్నగిరి గ్రామంలో జనసేన పార్టీని గ్రామ పంచాయతీ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసైనికుల అందరూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలోపేతం కోసం మండల  జనసైనికులు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. త్వరలోనే మండల, గ్రామ స్థాయి కమీటీలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జనసైనికులకు లీగల్ సమస్యలు ఏమైనా వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు. రోళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు టీ.రంగస్వామి మాట్లాడుతూ మండలంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, జనసేన పార్టీ భరోసాగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నగిరి గోపి, నగేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way