రేపల్లె నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

రేపల్లె

గుంటూరు ( జనస్వరం ) :  రేపల్లె నియోజకవర్గం నగరంలో జనసేన పార్టీ  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు  రేపల్లె పట్టణం, రేపల్లె నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి 4 మండలాల నుండి జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నామీద ఇష్ట-అయిష్టతతోనో, వేరొకరిమీద ఇష్ట-ఆయిష్టతతో కాకుండా జనసేనాని మీద, వారి యొక్క భావజాల స్పూర్తితో పనిచేసి 2024 ఆంధ్రప్రదేశ్ సీయంగా పవన్ కల్యాణ్ గారిని చూసేలా చేయాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేయుచున్నపుడు అధికార ప్రభుత్వం ఒత్తిళ్ళు, చట్టపరమైన అవాంతరాలు ఏర్పడితే వెంటనే తమకు తెలియపరిస్తే, జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలను గుర్తించి మండల కమిటీల తద్వారా గ్రామ కమిటీలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన మత్తి భాస్కర రావు, సమావేశ స్థలం మరియు సమావేశానంతర భోజన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన గోపరాజు ఉదయ కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మత్తి భాస్కర రావు, సంయుక్త కార్యదర్శి ఛందోలు ప్రసాద్, 4 మండల జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way