Search
Close this search box.
Search
Close this search box.

సూళ్ళూరుపేటలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

సూళ్ళూరుపేట

      నెల్లూరు ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం పెర్నాడు, కోరిడి, దామరాయి గ్రామాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ఇన్సూరన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసైనికుల పిలుపు మేరకు ఆ గ్రామాల్లో జనసేన నాయకులు  పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ఒక్క 10kmల తారు రోడ్డు వారి చిరకాల కల అని ఆ గ్రామస్తులు తెలియజేశారు. రోడ్డు లేనందున అక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు సరైన రవాణా సౌకర్యం లేక ఆ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదయినా అత్యవరం అయినప్పుడు అంబులెన్స్ కూడా ఆ గ్రామాలకి వెళ్లలేని పరిస్థితి లేదన్నారు. పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారు కానీ ఆ తరవాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు బాధపడ్డారు. ఈసారి జనసేనకు అవకాశం ఇస్తే మీ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం మేము చూపిస్తామని జనసేన నాయకులు హామీ ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో కిరణ్ మండల ఉపాధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి తీపలపూడి రమణ, మండల ప్రధాన కార్యదర్శి మేకల మురళి, సుబ్బరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way