Search
Close this search box.
Search
Close this search box.

సత్యవేడు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం

సత్యవేడు

           సత్యవేడు ( జనస్వరం ) : సత్యవేడు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ ఆదేశాల మేరకు మండల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారు మాట్లాడుతూ సత్యవేడు మండలంలో గ్రామస్థాయిలో పార్టీని బలిపీఠం చేసే విధంగా ప్రతి ఒక్కరు అడుగులు ముందుకు వేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజలకు మేము ఉన్నాము అనే ధైర్యాన్ని కల్పించే విధంగా కార్యచరణ తీసుకోవాలని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చేసే స్థాయిలో నిరంతరం కృషి చేయాలని ఆయన తెలియజేశారు. ఉపాధ్యక్షులు హేమంత్ గారు మాట్లాడుతూ, అందరం ఐక్యమత్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాష్ట్రం బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి.వి.ఎస్.విజయ్ కుమార్, జ్యోతిశ్వర్, కార్యదర్శులు ప్రసన్న, సాయి లోకేష్, మునిశేఖర్, అనిల్ కుమార్, సురేష్, జనసైనికులు చంద్రశేఖర్, ప్రవీన్ కుమార్ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way