Search
Close this search box.
Search
Close this search box.

ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండల, జనసైనికుల ఆత్మీయ సమావేశం ఆత్మకూరు జనసేనపార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి ముందు ఆత్మకూరు పట్టణంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో, భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు రూరల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రత్తిపాటి ప్రవీణ్ కుమార్ గారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే వరకు ప్రతి జనసైనికుడు అహర్నిశలు పనిచేయాలని అన్నారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను కొనియాడడం జరిగింది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన వంద మంది యువకులు ఉంటే, దేశ స్థితిగతులను మార్చవచ్చు అన్న వివేకానందుని బోధనలు స్ఫూర్తిగా, భావితరాలకు సువర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా, జనసైనికులు అందరూ ముందుకు నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేనపార్టీకి చెందిన ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way