అకాల వర్షాల కారణంగా నష్టపోయిన జొన్న రైతులను ఆదుకోవాలి : జనసేన నాయకులు

జనసేన

         విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం.. కొండగండ్రేడు, ముద్దాడ గ్రామం, మరియు పరిసర గ్రామాల్లో అకాల వర్షాలు వలన తీవ్రంగా మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను జనసేన పార్టీ జిల్లా నాయకులు,నియోజకవర్గ నాయకులు ఆదాడ మోహనరావు, విసినిగిరి శ్రీనివాసరావు,దంతులూరి రామచంద్ర రాజు,సంతోష్, త్యాడ రామకృష్ణారావు(బాలు) పరామర్శించారు. జనసేన నాయకులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకోసం అప్పుచేసి ఏకరాకు సుమారు యాబై వేలు ఖర్చుచేసారని,ఒక్క గర్ల మండలంలోనే సుమారు రెండు వందల ఎకరాలు మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, వీరికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరుపున అండగా నిలుస్తామని, ఎకరాకు ఏబైవేలు రూపాయలు జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రైతే దేశానికి,రాష్ట్రానికి వెన్నుముక అని చట్టశబల్లో ప్రగద్భాలు పలికే ఈ వైసీపి నాయకులకు ఈ రైతు బాధలు కనబడట్లేదా అని దుయ్యబట్టారు. ఈ అకాల వర్షాలు పడి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యవసాయ అధికారులు,ప్రజా ప్రతినిధిలు పరామర్శ చేయక పోవడం భాధాకరమని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు జనసేన పార్టీ తరుపున అండగా నిలిచి, పోరాడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way