ఏదో ఒక జిల్లాకి ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలు గారి పేరు పెట్టాలి :- జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ

    గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్లు పట్టణం బలిజ సంగీయులు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు పాల్గొన్న వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో వజ్రవైడూర్యాలను నడి బజార్లో పోసి వ్యాపారం చేయించిన మహారాజు, ప్రజలను కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్న ఏకైక రాజు, ఆయన రాజ్యపాలన రాముడి పాలనలా మరిపించిన ఆంధ్రభోజుడు, కవిసార్వభౌముడు అయినటువంటి కృష్ణదేవరాయలవారి చరిత్రనూ ఈ కాలం నాటి పాలకులు విస్మరిస్తున్న తీరును అవమానంగా భావిస్తూ, సుమారు ఆయన పరిపాలన కొనసాగించి 500 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన హయాంలో అభివృద్ధి చేసిన అనేక నీటి కుంటలు, చెరువులు మరియు దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఆయన గొప్ప పరిపాలన దార్శనికతకు నిదర్శనం. అలాంటి మహారాజు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అలాగే ఆయన పేరును ఏదో ఒక జిల్లాకు పెడుతూ భావితరాలకు ఆయన చరిత్రను తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చాలి అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరీ ముఖ్యంగా 30% ఓటు బ్యాంకు కలిగిన బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు గానే చూడకుండా, రాజకీయంగా చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలి, అలాగే అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నా మాకు రిజర్వేషన్ కల్పించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో అందరమూ సంఘటితమై అన్ని కులాలను మతాలను కలుపుకుంటూ అధికారాన్ని సాధించి ఈ పాలకులకు తగిన శాస్తి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way