Search
Close this search box.
Search
Close this search box.

ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనసేవకుడు RK కి ఘన సన్మానం

     గుడివాడ, (జనస్వరం) : ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు లలిత దంపతుల 34 వ వివాహవార్షిక దినోత్సవమ్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతోఅనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన Rkకి ఘనంగా సన్మానించి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.5000, గౌరవ అద్యక్షులు రూ.1000 లతొ కలపి రూ. 6000 విరాళంగా ఇవ్వడం అయినది. తమ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ Rk బృందం మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు దృష్ట్యా అందజేస్తున్నందుకు పార్టీలకు అతీతంగా సేవా దృక్పథంతో ఈ సన్మానం, విరాళం అందజేసినట్లు క్లబ్ ఫౌండర్ లోయ ఈశ్వర వెంకటేశ్వరావు తెలియజేశారు. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు మెచ్చి నాకు సన్మానం చేసిన ఒక తండ్రిగా వెన్నంటి ఉండి ప్రొత్సహిస్తున్న ఈశ్వర వెంకటేశ్వరరావుగార్కి, NTR స్టేడియం వాకర్స్ క్లబ్ నాయకులకు Rk కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ సమాజ సేవ చేయడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవాధ్యక్షులు పర్వతనెని చంద్రశేఖర రావు, క్లబ్ కార్యదర్శి అర్జా ప్రసాదు, క్లబ్ కోశాధికారి చింతా దుర్గా రామకృష్ణ, ట్రస్తు కార్యదర్శి లింగం చిట్టిబాబు, గాదం శెట్టి బసవేశ్వర రావు, మున్నలూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way