సోలార్ మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు కల్పించాలి : జనసేన నాయకులు సాయిబాబా

   అరకు, (జనస్వరం) : అనంతగిరి మండలం కొండిబ పంచాయతీ పరిధిలో గల కొత్తవలస గ్రామంలో ఇంటింటికి జనసేన మాటలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా. గేమ్మిలి, సన్యాసిరావు. రామ్ చందర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించడం జరిగింది. ముందుగా ఆ గ్రామస్తులతో సమావేశమై, సమస్యల పట్ల చర్చించారు. గ్రామాల్లో సోలార్ మరమ్మతులు ఉన్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని జనసేన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం జనసేన నాయకులు సాయిబాబా. సన్యాసి రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ సోలార్ మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం జనసేన మాటలు, సిద్ధాంతాలు క్లుప్తంగా గిరిజనులకు వివరించారు  అనంతరం మరమ్మతులో ఉన్న సోలార్ ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way