జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో సామాజిక సేవ

– కంటకాపల్లిలో రక్తదాన శిబిరం
– ఉత్సాహంగా పాల్గొన్న జనసైనికులు

     కంటకాపల్లి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో సామాజిక సేవలో జనసైనికులమంతా నిమగ్నమవుతున్నామని జనసేన నాయకులు తూరిబిల్లి విజయ్ కుమార్ పేర్కొన్నారు. జనసైనికుల ఆధ్వర్యంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. గ్రామ యువత, జనసైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంటీఅర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి రక్తం స్వీకరించారు. మొత్తం 45 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు తూరిబిల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాల్లో భాగంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రామ యువత సహకారంతో ప్రతి ఏడాదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మెరుగైన సమాజం కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న కృషికి మావంతు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుకు మదీనా రమేష్, మాడుగుల పైడిరాజు, సేనాపతి సునీల్, గణేష్, జె.భాస్కరరావు, ఎం.రాజేష్, టి.దుర్గాప్రసాద్, వెంకటేష్, లోకేష్, జనసైనికులు, గ్రామ యువత పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way