Search
Close this search box.
Search
Close this search box.

సిల్క్ సిటీ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ వారి సమస్యలపై చిలకం మధుసూధన్ రెడ్డికి వినతిపత్రం

మధుసూధన్ రెడ్డికి

        ధర్మవరం ( జనస్వరం ) : సిల్క్ సిటీ ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ రామమోహన్, గౌరవ అధ్యక్షులు ఆర్.వరాలయ్య,జి.నాగరాజు,వైస్ ప్రెసిడెంట్ కే. శ్రీనివాసులు గార్ల ఆధ్వర్యంలో ధర్మవరంలోని ఫోటో వీడియో గ్రాఫర్స్ కు సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యల గురించి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారి ప్రధాన సమస్యలు ఫోటోగ్రాఫర్స్ కాలనీ, మరియు ఫోటోగ్రఫీ భవన్ ఏర్పాటు చేయాలని ఈ విషయంపై గతంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులకు మేము ఎంత విన్నవించుకున్న వారు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు మా సమస్యలు తప్పకుండా మీరు తీర్చాలని కోరడం జరిగింది. ఈ సమస్యలు అన్ని చిలకం మధుసూదన రెడ్డి విన్న తర్వాత తప్పకుండా నేను ఎమ్మెల్యే అయ్యాక మీకు ఫోటోగ్రాఫర్స్ కాలనీ, మరియు ఫోటోగ్రఫీ భవన్ ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఫోటో వీడియో గ్రాఫర్స్ సొసైటీ వారు ఆనందపడి వారి సంపూర్ణ మద్దతు జనసేన పార్టీకి తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way