Search
Close this search box.
Search
Close this search box.

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి ? కొత్తపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్

    కొత్తపేట, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలో  తుఫాన్ కారణంగా గత 15రోజులు నుండి వర్షాలు వలన పూర్తిగా పంట పొలాలు నీట మునిగిపోవడం జరిగింది. దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించటానికి ఈ రోజు పలివెల శెరేపాలెం గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడ రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారపార్టీ నాయకులు ఎవరు పంట నష్టం గురించి కనీసం అడిగిన పాపానపోలేదు అని రైతులు వాపోతున్నారు అని అన్నారు. వెంటనే జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం రైతులకు ఎకరానికి 30వేలు పరిహారం ఇవ్వాలని, రైతులును ఆదుకోవాలి అని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way