ఛలో ఆంధ్ర యూనివర్సిటీలో పాల్గొనకుండా నాయకులు అక్రమ అరెస్టులు తగవు? : జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్

    పెందుర్తి, (జనస్వరం) : ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీ ప్రసాద్ రెడ్డిని వెంటనే రీకాల్ చేయాలని జనసేనపార్టీ మరియు విద్యార్థి, యువజన, ప్రజా అభ్యుదయ, దళిత, బహుజన సంఘాలు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఛలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొనకోకుండా ఉండుట కొరకు సి ఆర్ పి సి సెక్షన్ 151 క్రింద జనసేన పార్టీ 88 వార్డ్ నాయకులు జనార్ధన శ్రీకాంత్ వబ్బిన ను ముందస్తు అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలు అన్నీ కూడా చరిత్రలో కుప్పకూలిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అక్రమ అరెస్టులను జనసైనికులు మరియు ప్రజలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఛలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way