Search
Close this search box.
Search
Close this search box.

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన శివయ్య

      చిత్తూరు ( జనస్వరం ) : కార్మికులకి కర్షకులకి కార్మిక లోకానికి సంఘటిత అసంఘటి కార్మికుల లోకానికి మేడే శుభాకాంక్షలు జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య శ్రామికుల పక్షాన పోరాడే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో పైనిస్తూ కార్మిక లోకానికి సేవ చేసుకుంటామని చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య పేర్కొన్నారు. శ్రామికులు కార్మికులు కర్షకులు సంగటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ తమ రక్తాన్ని చెమట రూపంలో దారబోసిన వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ధనికులకి రాష్ట్ర ప్రభుత్వం కాపు కాస్తు సహాయ సహకారాలు అందిస్తూ పేద కార్మికులకి పొట్ట కొడుతుందని విమర్శించారు. ఉన్నవారికి సహకారం అందించిన లేకపోయినా వారేమో పస్తులు ఉండరు శ్రామికులు మాత్రం ఒక పూట తిని తినక చమటోడు వస్తుంటే వారి పక్షాన నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ధనికుల పక్షాన పనిచేస్తూ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు ప్రకటన గుర్తిస్తుంది. కోట్లాది రూపాయలు తన సంపాదనను రాజకీయ పార్టీ కోసం హెచ్చించి నికార్సైన నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి పేదల ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికునికి ఉందని ఆయన తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way