ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని శింగనమల జనసేన నాయకులు డిమాండ్

   శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ జనసేన నాయకులు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వమును డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు సాకే మురళి క్రిష్ణ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కేసులు ఎక్కువవుతుండడం వల్ల  విద్యార్థులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు పాఠశాలలో విద్యార్థులు కరోనా బారీన పడి బాదపడుతున్నారు ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించి కరోనా తగ్గేంత వరకూ పాఠశాలలకు సెలవులు మంజూరు చేయవలసినదిగా జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సాయిశంకర్, మధు, ప్రవీణ్, పెద్దయ్య, శేఘు రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way