పాఠశాలలు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి: బనగానపల్లె జనసేన నాయకులు

బనగానపల్లె

    బనగానపల్లె, (జనస్వరం) :  బనగానపల్లె పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కలిసి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గారు వారికి తెలియజేయడం జరిగింది. సోమవారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న సందర్భంగా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పర్యటించి అక్కడ ఉన్న యాజమాన్యాలతో మాట్లాడుతూ స్కూల్స్ లలో పనిచేసే ప్రతి ఒక ఉపాధ్యాయుడు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలని అలాగే పాఠశాలలో శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్ ముఖద్వారం దగ్గర ప్రతి విద్యార్థికి మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పట్టణంలోని నెహ్రూ స్కూల్, శ్రీ చైతన్యస్కూల్, ఆక్సిలియం పాఠశాలల యాజమాన్యాలకు బనగానపల్లె జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు స్పందిస్తూ తాము పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు అజిత్, అల్లాబకాస్, విక్రమ్, జనార్ధన్, మధు, ప్రశాంత్, రాము, మహేష్, వెంకటేష్, సింహాద్రి, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way