Logo
Date of Publish : 23 December 2023, 9:11 pm
Editor : Sake Naresh

జనసేన ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

     ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, YSR కాలనీ, తదితర కాలనీలో నిర్వహించారు. జనసేన-తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చేనేతలను, చిరు వ్యాపారులను, మైనారిటీ సోదరులను ఆదుకుని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కాలనీ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్సలు బాగోలేదని వాపోయారు. తప్పకుండా జనసేన టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే వారి యొక్క సమస్యలన్నీ తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. ధర్మవరంలో రౌడీ రాజ్యాన్ని పోగొట్టి ఈ వైసీపీ పాలనను అంతమోందించేందుకు ధర్మవరం ప్రజలంతా సహకరించి రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీనీ గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సుగుణ, ఆంజనేయులు, రామచంద్ర, శ్రీరాములు, మరియు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com