Logo
Date of Publish : 10 September 2022, 2:12 pm
Editor : Sake Naresh

అధికారంలోకి వస్తాం, ప్రజల ఇబ్బందులను గుర్తించి తీరుస్తాం : చిలకం మధుసూదన రెడ్డి

             ధర్మవరం ( జనస్వరం ) : అధికారంలోకి వస్తాం,ప్రజల ఇబ్బందులను గుర్తించి తీరుస్తాం అంటూ సేవ్ ధర్మవరం కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. సేవ్ ధర్మవరం కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 22వ రోజు పట్టణములోని 36 వ వార్డ్ కొత్తపేట లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటి ఇంటికి వెళ్లి సుడిగాలి పర్యటన'గావించారు. ప్రజల కష్టాలను తెలుసుకొని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. తమ ఊరి వాడి నని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఇంటి బిడ్డ అనుకుని ఆశీర్వదించాలని ప్రజలను వారు కోరారు. ఎవరికీ ఏ ఇబ్బంది' కలిగినా తన తలుపు తట్టాలన్నారు. తను చేతనయినంత సహాయ సహకారాలు అందిస్తానని ప్రజలకు వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్డగిరి శ్యాంకుమార్,బెస్త శ్రీనివాసులు,నాయుడు నాయక్, పేరూరు శ్రీనివాసులు,కోటికి రామాంజి,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com