Search
Close this search box.
Search
Close this search box.

నిమ్మళపాడు మైనింగ్ నుండి అరుకును కాపాడండి : జనసేన నాయకులు

అరుకు

       అరకు ( జనస్వరం ) : నిమ్మళపాడు మైనింగ్ నుండి అరకును కాపాడాలని అనంతగిరి జనసేన బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ పచ్చని ప్రాంతమైన నిమ్మలపాడులో మైనింగ్ మాఫియా పచ్చదనాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు. కనీసం పర్యావరణ అనుమతులు లేవు మరియు పీసా గ్రామ సభ జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం గిరిజనుల మీద లేని ప్రేమ మైనింగ్ విషయాల్లో ఉనదని, అక్రమంగా తీసుకు పోవుచున్నది గిరిజనులకు నడిచే దారిని… అనుమతులు ఇవ్వని మైనింగ్ కి ఏ విధముగా అనుమతి ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనులను మాయమాటలతో మభ్యపెట్టి కాల్ సైట్ మైనింగ్ అక్రమంగా తీసుకొని పోతున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వము ఈ మైనింగ్ మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల మీద ఎందుకు లేదు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మైనింగ్ మాఫియాను ప్రత్యేకంగా పరోక్షంగా సహకరిస్తున్న వైసిపి నాయకులు, గిరిజన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 1996 చట్టపరంగా ఈ మైనింగ్ అక్రమంగా జరుగుచున్నదని, ఏ రోజు గ్రామసభ జరుగలేదని అలాగే అమాయక గిరిజనులను మభ్యపెట్టి దోచుకోవడంలో వైసిపి ప్రభుత్వము ముందుందని అధ్యక్షులు చిట్టం మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు దండుసేన నవీన్ కుమార్, కొర్రా ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ రాందాస్, లక్ష్మణ ప్రసాద్, రామకృష్ణ, అనంతగిరి మండల నాయకులు జి.మంగళ కొర్రా రమేష్, వీరమహిళా రత్నప్రియా పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way