Search
Close this search box.
Search
Close this search box.

స్మశానం అక్రమానికి గురైందని, చర్యలు తీసుకోవాలని అధికారులకి విన్నవించిన సర్వేపల్లి జనసేన నాయకులు

సర్వేపల్లి

              సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వే పల్లి పంచాయతీ పరిధిలోని లింగంగుంట గిరిజన కాలనీ గిరిజన కాలనీ ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది. అయితే ఈ గిరిజనులు కుటుంబాలలో ఎవరైనా కాలం చెల్లితే పక్కనే ఉన్న స్థలంలో స్మశానవాటిక వాడుకునేవారు అయితే ఆ స్మశానవాటిక అనుకొని పొలాలు ఉండటంతో కొందరు రైతులు ఆ స్మశానాన్ని ప్రతి సంవత్సరం కొంచం కొంచం పొలాల్లో ఆక్రమించుకోవడం జరిగింది.  ఇప్పుడు వాళ్ళకి స్మశానం లేకపోవడం అదేవిధంగా చెరువు కట్ట అంచున ఎక్కడ దొరికితే అక్కడ దహన సంస్కారాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మండల తహశీల్దార్ గారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే గిరిజనుల సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని అలా జరగని పక్షంలో గిరిజనులు పక్షాన నిలబడి జనసేన పార్టీ నిరసన దీక్ష చేసేందుకు కూడా మేము సిద్ధమే అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, కాకి శివ కుమార్, సుధాకర్, బాబు, సుబ్రమణ్యం, కోటేశ్వరరావు, ప్రసాదు, వెంకట రమణయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way