రోజువారీ జీవనం సాగించే మదన్ కు తోపుడు బండిని సహాయం చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం వుసపల్లి గ్రామానికి చెందిన మదన్ ప్రతిరోజు సమోసాలు మరియు పానీ పూరి సైకిల్ పై పెట్టుకొని అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే దానిపైన వచ్చేటువంటి రూపాయి కుటుంబ పోషణకు చాలా కష్టం గా వుండేది. ఒక రోజు జనసేన పార్టీ పొదలకూరు మండలంలో లోకేష్ నాయుడు అతనితో మాట్లాడటం, ఆ సందర్భంలో ఆయన కష్టాలను అతనికి తెలియజేయడం దాంతో అతని మనసు చలించి జనసేన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబ పోషణ నిమిత్తం ఒక బండి ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. పొదలకూరు మండలం సిఐ గంగాధర్ రావు గారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ పార్లమెంటరీ కమిటీ మెంబర్ పోలంరెడ్డి ఇందిరా గారు మరియు లోకేష్ నాయుడు, కొప్పాల నవీన్, జయకృష్ణ, కోంగి గణేష్, పూర్ణ, విష్ణు సాయి తదితరులు పాల్గొన్నారు.