కాలుష్యం కోరల్లో బ్రతికి ఉండడానికే పోరాటం చేస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం

సర్వేపల్లి

           కొవ్వూరు ( జనస్వరం ) : యాష్ పాండ్ల వలన తమ జీవితాలు దుబ్బరం అవుతున్నాయని గిరిజన నాయకుల సమాచారం మేరకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిడ్డలకు వస్తున్న చర్మవ్యాధులను కాలుష్యం బారిన పడిన స్థానికుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బ్రతికి ఉండడానికి పోరాటం చేస్తున్నారు ఇక్కడ గిరిజనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే దుమ్ము దూళి తో పర్యావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. మనుషుల ఆయుర్దాయం తక్కువ.మొక్కలు కూడా ఎదిగే పరిస్థితి లేదు.జీవనాధారమైన చెరువు హాష్ఞ పాండ్తో నిండిపోయింది. చిన్న బిడ్డలకు ఒళ్లంతా కురుపులు ఏ మందు వాడినా తగ్గని లేదు. గడప గడపకి వచ్చిన కాకాని గారు గిరిజన కాలనీ మొదట్లోనే వెనుతిరిగాడు.స్థానికులంతా ముట్టడించడంతో సమస్యలు అడిగి సైలెంట్ అయిపోయాడు. దాదాపు 80 గడపలు 300 మంది నివసిస్తున్న ఈ ప్రాంత వాసులను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు ఇప్పిస్తే వెళ్ళేందుకు వీరందరూ సిద్ధంగా ఉన్నారు. తమ పార్టీకి ఉపయోగపడతారని,పెత్తందారికి వ్యవస్థకు తోడు ఉంటారని ఇళ్ళు ఉన్న వారికే ఇచ్చే బదులు ఇటువంటి వారికి ఇల్లు ఇస్తే ఒక సముదాయాన్ని కాపాడిన వారు అవుతారు.  సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం.. సమస్య పరిష్కరించి వీరికి పౌనరావాసం కల్పించే వరకు కూడా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, ఆమీన్, ఖలీల్, కేశవ,మౌనిష్ వర్షన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way