జనసేనాని జన్మదిన సందర్భంగా గర్భిణీలకు చీరలు, పసుపు, కుంకుమ అందజేత

జనసేనాని

           హిందూపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ జన్మదిన వేడుకలు హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హిందూపురం పట్టణంలోని S V సినీ కాంప్లెక్స్ నందు హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఉదయం కొల్లకుంటలోని ఆంజనేయ స్వామి గుడిలో పట్టణ అధ్యక్షుడు కొల్లకుంట శేఖర్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించి గర్భిణీ స్త్రీలకు చీర, పసుపు, కుంకుమను పంచిపెట్టారు. చౌడేశ్వరీ కాలనిలో జనసేన నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో 50 మంది గర్భిణీ మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్, నాగభూషణం, నవీన్, ప్రభు, నాగరాజు, లింగ, హనుమంతు, మనోహర్, దిలీప్, వీరమహిళ మణిప్రియ మరియు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way