పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి రంగోలి పోటీలు

– విజేతలకు బహుమతులు అందించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి 

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగలు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికతను ప్రబోధిస్తాయి అని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసైనికుల ఆధ్వర్యంలో రంగవల్లులు ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ వారి జన సైనికులకు నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి పండగ ధనుర్మాసం నెల రోజులను ముగ్గుల మాసంగా పిలుస్తూ.. ప్రతి ఇంటా ముగ్గులతో అలంకరిస్తారు అని అన్నారు. అలాగే ఈ సంక్రాంతి అన్నది ప్రతి ఒక్కరికి ఆదర్శమైన పండగ. అలాగే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒమైక్రాన్ కోవిడ్ తీవ్రత పెరుగుతోందని కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పండగ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంతున్నానని తెలియజేశారు. అనంతరం ముగ్గులు పోటీలో పాల్గొన్న ఆడపడుచుల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో..కీర్తి చంటి, వినుకొండ అమ్మాజీ, సిహెచ్ శిరీష,జనసేన పార్టీ గొల్లప్రోలు మండలం అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, పుణ్యంమంత్రుల సూర్యనారాయణ మూర్తి, యాండ్రపు శ్రీనివాస్, మేళం బాబి, సి.హెచ్ నవీన్, జై.వరలక్ష్మి, జై.చక్ర వేణి, యూ.శ్రీ లక్ష్మ వి.సూర్యకాంతం, వీరసత్య, నాగమణి, సాయి, సత్య, రాధా, శివ, చక్కవని, జ్యోతి శివ దుర్గ, ఆదిలక్ష్మి, దేవి, దుర్గా, శ్రీ లక్ష్మి, వాణి, వీర వెంకట లక్ష్మి, రాధ, వీరలక్ష్మి, పూర్ణ శ్రీ, బాబి, కగాయలత, బి నాగమణి, నవ్య, మౌనిక, వీరకుమారి, మహాలక్ష్మి, ప్రదీప్,శివ రెడ్డి, జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way