నందలూరులో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

    రాజంపేట ( జనస్వరం ) : నందలూరులో రాజంపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలను శనివారం నందలూరులో రంగవల్లల పోటీలను రాష్ట్ర జనసేన పార్టీ అధికారి ప్రతినిధి కీర్తన మరియు నందలూరు మండల జనసేన పార్టీ నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిధులుగా రాజంపేట సేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందలూరు మండల సౌమ్యనాధ స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన పోటీలలో పలువురు వీర మహిళలు వేసి రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గెలుపొందిన వీరమహిళలకు రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్‌ మొదటి బహుమతిగా గెలిచిన పసుపులేటి భారతికి గ్రైడంర్‌, స్వప్న గారికి రెండవ బహుతిగా మిక్సి, స్వీటి మూడవ బహుమతిగా గ్యాస్‌ స్టౌవ్‌, 4, 5, 6 స్థానలలో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way