విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో సంజీవయ్య శతజయంతి వేడుకలు

    విజయవాడ, (జనస్వరం) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సంజీవయ్య నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప వ్యక్తిని, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేద ప్రజలకు పంచి మహోన్నతుడానీ, అవినీతి చేసిన వారి భరతం పట్టడానికి అవినీతి నిరోధక శాఖ రూపకర్తని, కేవలం ప్రజల సంక్షేమం కోసమే చివరి క్షణం వరకు ప్రాకులాడిన ఉన్నతమైన వ్యక్తిత్వం గల రాజకీయ నాయకులని, అందుకనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దామోదరం సంజీవయ్య గారి లాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆదర్శాలను పుణికిపుచ్చుకుని రాజకీయాలు చేస్తున్నారని, సంజీవయ్య స్ఫూర్తిని కొనసాగించాలని, వారి ఇంటిని చారిత్రాత్మకంగా ఒక స్మారక చిహ్నంగా నిలబెట్టాలనే సంకల్పంతో కోటి రూపాయల విరాళం అందజేశారని గుర్తు చేశారు. సంజీవయ్య ఆశయాలు కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సోమి. మహేష్ బంగారు. నూకరాజు, కొరగంజి. రమణ,రెడీపల్లి, గంగాధర్, సయ్యద్ అబ్దుల్ నజీబ్, సాబింకర్ నరేష్, బావిశెట్టి ,శ్రీను, పోలిశెట్టి. శివ ,బూరెల శంకర్, రామిశెట్టి మురళి, పొట్నూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way