పారిశుధ్య లోపం – ప్రజలకు వ్యాధులు. తక్షణమే చర్యలు తీసుకోండి – పలాస నియోజకవర్గ జనసేన నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్

పలాస

   పలాస, (జనస్వరం) :  పారిశుద్ధ్య లోపంతో ప్రజలు రోగాలకు గురవుతున్నారని పలాస నియోజకవర్గ జనసేన నాయకులు హరిశ్ కుమార్ శ్రీకాంత్ అన్నారు. ఈ విషయంపై బుధవారం నాడు పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం డీఈఈ ఎన్‌. వి. వి నారాయణకు వినతిపత్రాన్ని అందించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో విషజ్వరాల నివారణ కొరకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలని, కొన్ని సలహాలుతో కూడిన సూచనలు ఆయన ఇచ్చారు. ఇటీవల పడిన భారీ వర్షాల ఫలితంగా మున్సిపాలిటీ వార్డులలో చాలా వరకు మురికి నీరు నిల్వ ఉండడంతో, దోమలు తమ సంతానోత్పత్తిని పెంచి, ప్రజలకు వివిధ రోగాలను కలుగజేస్తున్నాయని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో డిడిటిని పిచికారీ చేయాలని ఆయన కోరారు. వార్డులలో జ్వరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను తెలుసుకొని, ప్రతిరోజూ ఆ వార్డులకు ఫాగింగ్ మెషిన్‌ను పంపాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీలో 14 15, 16 వార్డ్ ప్రజలు నిల్వ ఉండే నీటితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, పద్మనాభపురం కాలనీలో ఉండే 8వ సచివాలయంకు వెళ్లి, సమస్య మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని అక్కడ సిబ్బందిని కోరానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way