Logo
Date of Publish : 28 March 2023, 4:16 pm
Editor : Sake Naresh

నిబంధనల మేరకే ఇసుక రీచును నడపాలి : జనసేన నాయకుడు అతికారి దినేష్

          సిద్దవటం ( జనస్వరం ) : మండలంలోని జంగాలపల్లి గ్రామంలోని ఇసుక రీచును నిర్వాహకులు నిబంధనల మేరకు నడపాలని జనసేన నాయకుడు అతికారి దినేష్ స్పష్టం చేశారు. మండలంలోని జంగాలపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జంగాలపల్లిలోని ఇసుక రీచును నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజల వైపునుంచి జనసేన ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇసుక రీచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు పోయిన బాదితురాలికి ఆర్ధిక సహాయం అందిస్తే సరిపోదని ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం వచ్చేలా కృషి చెయ్యాలన్నారు. ఇసుక రీచు నుంచి వెళ్లే వాహనాలు ఎక్కువ టన్నేజ్ తీసుకెళ్తుండడంతో రోడ్లు దెబ్బతిన్నాయని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జంగాలపల్లి రోడ్డు ప్రమాద బాదితులకు ఆర్ధిక సహాయాన్ని అందించడంతో పాటుగా సిద్దవటంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడ్డ సలీం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com