Search
Close this search box.
Search
Close this search box.

గిరిజన గ్రామాల రహదారులను పట్టించుకోని పాలకులు

గిరిజన

           శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో  అధ్వాన్నంగా గిరిజన గ్రామాల రహదారులున్నాయని ఆదివాసులు అంటున్నారు. గిరిజనులు గుడ్డిమీద గూడ నుంచి కుమ్మరిగండి రహదారి దుస్ధితి మరీ అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాలైన గుడ్డిమీద గూడ. కుమ్మరిగండి ఈగ్రామాలకు మండల కేంద్రం నుండి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన రహదారులు లేక వాహనాలు నడవక మండల కేంద్రానికి రావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుడ్డిమీద గూడ నుండి కుమ్మరిగండి గ్రామాలకు ఆటోలు కూడా నడిచే పరిస్ధితి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈగ్రామాలల్లో పాఠశాలకు ఉపాద్యాయులు వివిధ గ్రామాల నుండి సరుకులు రవాణా చేసే వాహనాలు కూడా చేరుకోలేని పరిస్ధితిలు ఉన్నాయని అన్నారు.  అత్యవసర సమయాల్లో వాహనాలు కూడా రావుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు పట్టించుకొని త్వరగా రహదారిని మరమ్మతులు చేయించి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way