రాయచోటి నుండి సుండుపల్లి మీదగా ఆర్టీసి బస్సులు నిర్ణీత సమయాల్లో నడపాలి

● రాయచోటి డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్
    రాయచోటి, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాయచోటి నుంచి సుండుపల్లి మీదుగా రాయవరం, పించ, సానిపాయి, రాజంపేట తదితర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్న ఆర్ టి సి బస్ సర్వీసులు ప్రయాణికులకు అనుకూలమైన సమయాల్లో, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పాలకులు, సంబంధిత శాఖ అధికారులు తక్షణమే యుద్ధప్రాతిపదికన స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్కూల్, కాలేజి వెళ్ళే విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యార్థంగా బస్ స్టాప్ లు ఉండాలని అలాగే సుండుపల్లి మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాన్ని గుర్తించి వందల వేల మంది ప్రజలు రాజంపేట, పీలేరు, తిరుపతి అలా దూరప్రయాణాలు చేసే ప్రయాణికులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని బస్ షెల్టర్ వద్ద మహిళలను, వృద్ధులను, విద్యార్థిని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సంబంధిత శాఖ అధికారులు మరుగుదొడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షైక్ రియాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way