Search
Close this search box.
Search
Close this search box.

గ్రామాల్లో ఉన్న రోడ్లను బాగు చేయాలని వైసీపీ నాయకులను హెచ్చరించిన రోసనూరు సోమశేఖర్

రోసనూరు సోమశేఖర్

    సూళ్లూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ దొరవారి సత్రం మండలం ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి మరియు ప్రధాన కార్యదర్శి మణి ఇచ్చిన సమాచారం మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ వారితో వెళ్లి గ్రామంలోని రోడ్లను పరిశీలించారు. హైవే నుంచి పాలెంపాడు మీదుగా వేణుంబాక గ్రామం వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా తయారయిందని అన్నారు. దారి పొడవునా పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా తయారైందని, అభివృద్ధిపై నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైసీపీ పాలనపై సోమశేఖర్ అసహనం వ్యక్తపరిచారు. అలానే వేనుంబాక జనసైనికులను కలిసి రోడ్డు గురించి అధికారులతో చర్చిద్దామని హామీ ఇచ్చారు. అధికారులను ఉద్దేశించి వేణుంబాక రోడ్డు విషయంలో చొరవ తీసుకోవాలని వారిని అభ్యర్ధించారు. అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే దిశగా మొదలుపెట్టిన మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం గురించి వివరించారు. అదేవిధంగా గతంలో పాలెంపాడు గ్రామంలో వీధిలైట్లు సమస్య మరియు కరెంటు పోలు పడిపోయే పరిస్థితిలో ఉంది, ఆ ప్రాంతంలో పసిపిల్లలు తిరుగుతూ ఉంటారు అని స్థానికులు తెలియజేయగా AE గారికి మరియు సెక్రటరీ గారికి ఫోన్ కాల్ చేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా జనసేన తరపున సోమశేఖర్ అభ్యర్థించారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని బదులిచ్చిన అధికారులు ఇరువురికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way