పల్నాడు జిల్లా నూతన అదనపు ఎస్పీ(అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ కుమార్ చౌదరి.
నరసరావుపేట,జూలై11 (జనస్వరం)
పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, నరసరావుపేట నందు అదనపు ఎస్పీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.2022 బ్యాచ్ కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి గ్రేహౌండ్స్ నందు, తాడిపర్తి నందు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బదిలీపై పల్నాడు జిల్లాకు రావడం జరిగింది.