Search
Close this search box.
Search
Close this search box.

పాడేరులో జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో రోడ్ల నిరసన కార్యక్రమం

     పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ,తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో భాగంగా పాడేరు నియోజకవర్గ జనసేనపార్టీ,ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య, తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త శ్రీమతి గిడ్డి ఈశ్వరీ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య మాట్లాడుతూ పాడేరు మండలానికి కూత వేటు దూరంలో ఉన్న లాడపుట్టు గ్రామ సమీపంలోగల పాడేరు, నుంచి జి.మాడుగుల వెళ్లే ప్రధాన రహదారి గుంతల కారణంగా గతంలో ఒక యాక్సిడెంట్ జరిగి ఒక నిండు ప్రాణాలు కోల్పోయారని  జనసేన,టీడీపీ నాయకులు తెలిపారు. ముందుగా బొకేళ్ళు అనే గ్రామం నుంచి ఇరుపార్టీల కార్యకర్తలు ర్యాలీగా సంఘటన, జరిగిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉన్న గుంతలు పరిశీలించి ఇదే జగనన్న మార్క్ అభివృద్ధి అని ఇదో కొత్తరకమైన టెక్నాలజీ అని రోడ్డు రవాణా వ్యవస్థ పై ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు. అలాగే కచ్చితంగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ తో కలిసి రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తరిమికొడతామని అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.అనంతరం కొత్తవూరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది అక్కడ ఇరు పార్టీల నేతలు చేరుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నేతలు కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way