పాడేరులో జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో రోడ్ల నిరసన కార్యక్రమం

     పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ,తెలుగుదేశం ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో భాగంగా పాడేరు నియోజకవర్గ జనసేనపార్టీ,ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య, తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త శ్రీమతి గిడ్డి ఈశ్వరీ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా..గంగులయ్య మాట్లాడుతూ పాడేరు మండలానికి కూత వేటు దూరంలో ఉన్న లాడపుట్టు గ్రామ సమీపంలోగల పాడేరు, నుంచి జి.మాడుగుల వెళ్లే ప్రధాన రహదారి గుంతల కారణంగా గతంలో ఒక యాక్సిడెంట్ జరిగి ఒక నిండు ప్రాణాలు కోల్పోయారని  జనసేన,టీడీపీ నాయకులు తెలిపారు. ముందుగా బొకేళ్ళు అనే గ్రామం నుంచి ఇరుపార్టీల కార్యకర్తలు ర్యాలీగా సంఘటన, జరిగిన ప్రదేశానికి చేరుకుని అక్కడ ఉన్న గుంతలు పరిశీలించి ఇదే జగనన్న మార్క్ అభివృద్ధి అని ఇదో కొత్తరకమైన టెక్నాలజీ అని రోడ్డు రవాణా వ్యవస్థ పై ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు. అలాగే కచ్చితంగా ఈ రాక్షస ప్రభుత్వాన్ని జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ తో కలిసి రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తరిమికొడతామని అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.అనంతరం కొత్తవూరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది అక్కడ ఇరు పార్టీల నేతలు చేరుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నేతలు కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way