Search
Close this search box.
Search
Close this search box.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో దామోదర సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి

శింగనమల

           అనంతపురం ( జనస్వరం ) :  జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మురళి క్రిష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందించారు. శింగనమల జనసేనపార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ గారికి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్రంలో వివిధ మంత్రి పదవులు అనుభవించి, పూరిగుడిసెలో బ్రతికిన నిజాయితీ ఉన్న నేత కీ శే దామోదరం సంజీవయ్య గారి కాంస్య విగ్రహం బుక్కరాయదముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, బుక్కరాయదముద్రం జనసేన మండల కన్వీనర్ ఎర్రిస్వామి, శింగనమల మండల కన్వీనర్ తోట ఓబీలేశు, మోహన్ కిరణ్ సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way