జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   విజయవాడ, (జనస్వరం) : గణతంత్ర దినోత్సవ వేడుకలను 53వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తమ్మిన గురవమ్మ సత్రం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ జండా వందనం చేసిన అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని, విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఏపీలో వైయస్ జగన్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఈ పాలనలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వనాశనం అవుతున్నాయని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాలు ప్రదర్శించినంత మాత్రాన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నట్ల కాదని, వాస్తవ కోణంలో గుడివాడలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వ నాశనం చేస్తూ క్యాసినోవా సెంటర్లో ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకొని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేకపల్లి శ్రీను, తమ్మిన బాబి, మోహన్ రావు, స్టాలిన్, నల్లబెల్లి కనకారావు, ఉమామహేశ్వరరావు సోమశేఖర్, మదన్ కుమార్, శివ, రాము, రమణారెడ్డి, నూకరాజు, మూర్తి, పండు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way