Search
Close this search box.
Search
Close this search box.

ఆమదాలవలస జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం ఆవరణలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇంఛార్జ్  శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారు సరుబుజ్జిలి ఆర్మీ జవాన్ తోట కృష్ణ మూర్తి గారిచేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మనమంతా స్వయం పాలనతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే.. కారణం ఆ సమరయోధులే. అందుకే.. వారి త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ.. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ.. సగర్వంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way