శిథిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు – విశేష స్పందన

రహదారి

      అనంతపురం ( జనస్వరం ) : క్లాక్ టవర్ బ్రిడ్జి ప్రక్కన కోర్టు రోడ్డుకు వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు… శిధిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు చేసినందుకు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు  లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారికి “అభినందనలు” తెలిపిన స్థానిక నగర ప్రజలు, వాహనదారులు, దుకాణదారులు.  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ద్వారా గుంతలు పడ్డ రహదారి మరమ్మత్తు చేసినందుకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టవర్ క్లాక్ బ్రిడ్జ్ పక్కన కోర్ట్ రోడ్డుకు పోవు సర్వీస్ రోడ్డు… శిధిలమైపోయిన రహదారికి జనసేన నాయకులు తెల్ల గరుసు వేసి గోతులను పూడ్చి చదును చేశారు. సంవత్సరాల తరబడి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలియజేశారు. అనంతరం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి  స్పందించి రహదారిని తన సొంత నిధులతో బాగు చేయడం పట్ల స్థానికులు, వాహనదారులు, వ్యాపారస్తులు.. జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు శ్రమదాన కార్యక్రమం చేసి రోడ్డు మరమ్మత్తు చేసిన జయరామిరెడ్డి గారికి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way