Search
Close this search box.
Search
Close this search box.

పంట పొలాల్లోని కాలువలను బాగుచేయండి : రాజోలు జనసేన నాయకులు

     రాజోలు, (జనస్వరం) : రాజోలు మండలంలో గత రెండు సంవత్సరాలుగా పంట కాలువలో పూడిక తీయని కారణంగా పొలాలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో పూడిక తీయకపోతే రైతులు పంటలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించి రాజోలు గ్రామ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి, వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు, మెరక పాలెం ఎంపీటీసీ పొన్నం నాగ దుర్గ కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ AE ఈశ్వర రావుకి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన ఎం పి టి సి దార్ల కుమారి లక్ష్మీ మాట్లాడుతూ కాలువలో నీరు ఉన్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడిందని, సాగునీరు పారాలంటే వెంటనే కాలువలో పూడిక తొలగించాలని, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి వచ్చే పంట పనులు మొదలు అయ్యే లోపు రైతులకు నీరు అందేలా చేయాలని అధికారులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way