Logo
Date of Publish : 13 August 2022, 5:12 pm
Editor : Sake Naresh

మార్కాపురం పట్టణము నందు చెత్తను తొలిగించండి : జనసేన నాయకులు ఇమ్మడి కాశినాథ్

     మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణము నందు గత కొన్ని రోజులుగా చెత్త చెదారం పేరుకొని తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న మార్కాపురం చెరువు కాలువ సప్లయ్ ఛానల్ ఆగిపోవడంతో దోమలకు ఆవాసంగా మారి పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర విష జ్వరాలకు గురి అవుతున్నారు. ఇరిగేషన్ మరియు మున్సిపాలిటీ అధికారుల సమన్వయ లోపం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాలలో ఆర్డిఓ కార్యాలయము, ఇరిగేషన్ కార్యాలయం ఉండటం విశేషం. దీనిపై అనేక ధర్నాలు జరిగిన పట్టించుకోని అధికార పార్టీ నాయకులు, వారి యంత్రాంగం. ఈ సమస్య పై మార్కాపురం ఆర్డీఓ లక్ష్మీ శివ జ్యోతిH దృష్టికి తీసుకువెళ్లిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. తక్షణమే ఆర్డీఓ స్పందించి తదితర అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com