7వ రోజుకి చేరిన ఆశా వర్కర్ల రిలే దీక్షలు, దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన

ఆశా వర్కర్ల

      మంగళగిరి ( జనస్వరం ) : పని వత్తిడి వల్ల తాడేపల్లి – ముగ్గురోడ్ ప్రాంతానికి చెందిన ఆశా వర్కర్ కృపమ్మ మృతి కారణమైన ప్రకాష్ నగర్ ఆస్పత్రి మెడికల్ అధికారి మానస మంజరి, హెచ్. యు రమాదేవిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 7వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ కృపమ్మను పని ఒత్తిడి గురిచేసి మృతికి కారణమైన ప్రకాష్ నగర్ ఆస్పత్రి మెడికల్ అధికారి మానస మంజరి,హెచ్.వి. రమాదేవి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా టైం లో ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని అన్నారు. వారికి కనీసం ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పనిచేయించడం సరైన విధానం కాదని అన్నారు. ఆశా వర్కర్లకి ఒక్కరోజు సెలవు ఇవ్వాలని పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శా వర్కర్లకి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు పసుపులేటి అశోక్, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి చీరల లాల్ చంద్, మండల కార్యదర్శి మున్నా శ్రీనివాసరావు, చిర్రావూరి గ్రామ కార్యదర్శి వేంపాటి హరినాథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way